డబుల్ మీనింగ్ డైలాగులతో జబర్దస్త్‌లో రోహిణి రచ్చ

by Disha Web Desk 12 |
డబుల్ మీనింగ్ డైలాగులతో జబర్దస్త్‌లో రోహిణి రచ్చ
X

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్స్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి పలు రకాల కామెడీ షోలలో, సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది రోహిణి. తన కామెడీతో, టైమింగ్ పంచులతో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిణి.. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలో నవ్వులు మరింత పండేందుకు డబల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయింది రోహిణి. ఆ పంచులు నవ్వులు తెప్పించగపోగా.. అందరికి చిరాకు తెప్పిస్తున్నాయి.

తాజాగా అక్టోబర్ 21న ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ఇందులో రోహిణి ఆహ్వానం సినిమాలో రమ్యక్రిష్ణ పాత్రను స్కిట్ రూపంలో చేసింది. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌ని రోహిణి తన డబల్ మీనింగ్ డైలాగ్‌లతో చెత్త చెత్త చేసింది. ఆ స్కిట్‌లో భాగంగా.. రోహిణి భర్త ఓ డబ్బు ఇంటి అమ్మాయి కోసం తనకు విడాకులు ఇస్తాడు. ఆ నోటీసులు అందరికీ పంచిపెడుతూ.. నేను ఇప్పటి నుంచి స్వేచ్చా జీవిని. నన్ను ఎవరైనా గెలకవచ్చు.. గోకొచ్చు.. నా మనసు దోసుకోవచ్చు అని చెప్తుంది. ఆ వెంటనే జడ్జిగా వ్యవహరిస్తు్న్న కృష్ణభగవాన్.. అడ్రస్ ఎక్కగా అని అడుగుతాడు. ఆహ్వనం సినిమాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వాళ్ల అందరికీ ఈ స్కిట్ చూస్తుంటే.. చాలా రోతగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

వైఫల్యాలే మనల్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి.. పరిణీతి

Next Story

Most Viewed